ప్రధాన నిందితుడు తిరుమలరావు

తేజేశ్వర్ హత్య కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ మేనేజర్ తిరుమలరావును గద్వాల పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటికే ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా తెల్లవారుజామున సూపరీ గ్యాంగ్‌ సాయంతో పోలీసులు సంఘటనా స్థలంలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ను నిర్వహించారు. ఈ దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.తేజేశ్వర్‌ హత్య కేసు ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారిస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.

Read More : హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు వేగం

One thought on “ప్రధాన నిందితుడు తిరుమలరావు

Comments are closed.