లెజెండరీ నటి శ్రీదేవి చివరిగా నటించిన చిత్రం “మామ్“. ఈ భావోద్వేగాత్మక థ్రిల్లర్ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. శ్రీదేవి అత్యద్భుతమైన నటన, హృదయాన్ని కదిలించే కథనం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి. ఇప్పుడు, ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశేషమేమిటంటే, ఈ సీక్వెల్లో శ్రీదేవి తనయ ఖుషి కపూర్ ప్రధాన పాత్రలో నటించనుందని సమాచారం.
శ్రీదేవి నటనా వారసత్వాన్ని కొనసాగించేందుకు ఖుషి కపూర్ సిద్ధమవుతోంది. ఇప్పటికే “ది ఆర్చీస్” వెబ్ ఫిల్మ్ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఖుషి, తన తల్లి చివరి సినిమాకు సీక్వెల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుందట. ఈ ప్రాజెక్ట్పై ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, స్క్రిప్ట్ను రూపొందించే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నారని సమాచారం.
2017లో విడుదలైన “మామ్” సినిమాను రవి ఉదయ్వార్ దర్శకత్వం వహించగా, శ్రీదేవి ఇందులో ఓ తల్లిగా నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. సినిమా విజయం సాధించడంతోపాటు, శ్రీదేవికి జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందించింది. ఇప్పుడు సీక్వెల్ వస్తుందనే వార్తతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఖుషి కపూర్ ఈ ప్రాజెక్ట్ను ఒప్పుకుంటుందా? శ్రీదేవి స్థాయిలో తన ప్రతిభను ప్రదర్శించగలదా? అనేది వేచిచూడాల్సిన అంశం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

One thought on “శ్రీదేవి ‘మామ్’ సినిమాకు సీక్వెల్.. కూతురు ఖుషి కపూర్ ప్రధాన పాత్రలో?”
Comments are closed.