బాలీవుడ్ స్టార్ జంట సిద్దార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వాణీ తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. 2023లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, త్వరలో తమ మొదటి బిడ్డను ఆహ్వానించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
సిద్దార్థ్ ఇటీవల యూట్యూబర్ లిల్లీ సింగ్తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కియారాతో తన మొదటి కలయిక గురించి చెప్పుకొచ్చారు. “లస్ట్ స్టోరీస్” సెట్స్లో కరణ్ జోహార్ను కలవడానికి వెళ్లినప్పుడు, కియారాను మొదటిసారి కలిశానని ఆయన తెలిపారు. ఈ సినిమా కియారా కెరీర్లో కీలక మలుపు తీసుకురాగా, వారి ప్రేమకథకు కూడా ఆరంభమైందని పేర్కొన్నారు.
తన భార్య కియారాను సమర్థిస్తూ, ఆమె నటన, తెరపై తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయాలను సిద్దార్థ్ ప్రశంసించారు. అలాగే, కుటుంబ విలువలకు కట్టుబడి ఉండే ఆమె వ్యక్తిత్వాన్ని ఇష్టపడతానని చెప్పారు. తమ భవిష్యత్తులో పిల్లలను ఎలా పెంచాలనే విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన సిద్దార్థ్, “పురుషుడిగా జన్మించడమే కాదు, మన కర్తవ్యం కూడా తెలుసుకోవాలి. బాధ్యతాయుతంగా, మరింత సున్నితంగా మరియు సహానుభూతితో మెలగడం ఒక పురుషుడిగా మారటానికి అసలైన లక్షణాలు” అంటూ వ్యాఖ్యానించారు.
సిద్దార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన త్వరలో తండ్రి కాబోతున్నారని అభిమానుల్లో ఊహాగానాలకు దారితీశాయి. బిడ్డ పుట్టిన తర్వాత ఈ జంట తమ కొత్త బాధ్యతలను ఎలా నిర్వహిస్తారో చూడాల్సిందే!
Read More

One thought on “లస్ట్ స్టోరీస్ సెట్స్లో కియారా అద్వాణీని మొదటిసారి కలిశాను: సిద్దార్థ్ మల్హోత్రా”
Comments are closed.