అక్రమ బెట్టింగ్ కేసులో శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు.

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్‌ “1xBet” కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయనకు సమన్లు జారీ చేసింది. గురువారం విచారణ కోసం హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.

అధికారుల సమాచారం ప్రకారం, ఆ యాప్‌కు సంబంధించిన కొన్ని ప్రచార కార్యక్రమాల్లో ధావన్ పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆర్థిక లావాదేవీలు, సంబంధాలపై స్పష్టత కోసం ఈడీ విచారణ జరపనుంది.

ఇకపోతే, ఇటువంటి అక్రమ బెట్టింగ్ యాప్‌ల ద్వారా కోట్ల రూపాయలు దోచుకోవడం, పన్నులు ఎగవేయడం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గత నెలలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను కూడా అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు ధావన్‌ను విచారణకు పిలవడం కేసులో మరో కీలక పరిణామంగా మారింది.

Read More : బీసీసీఐ అధ్యక్ష పీఠంపై క్రికెట్ దిగ్గజం?