మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రధాన పాత్రలో రోహిత్ కె.పి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సంభరాల యేటిగట్టు’. ‘హనుమాన్’ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హోలీ సందర్భంగా, చిత్రబృందం స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో మొత్తం టీమ్ కలసి రంగుల పండుగను ఆనందోత్సాహంగా జరుపుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయితే, ఈ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్కు కొత్త షేడ్ – కార్నేజ్ రెడ్ అని చిత్రబృందం చెప్పుకొచ్చింది.
ఈ చిత్రంలో సాయి దుర్ఘ తేజ్ పూర్తిగా కొత్త లుక్లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్లో మాచో లుక్, ‘కార్నేజ్’ వీడియోలో ఆయన ఇచ్చిన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను గూస్బంప్స్కి గురి చేసింది.
ప్రస్తుతం, చిత్రయూనిట్ హైదరాబాద్లో ఓ పాటను చిత్రీకరిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ను సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

One thought on “‘సంభరాల యేటిగట్టు’ హోళీ స్పెషల్ పోస్టర్ విడుదల – సాయి దుర్గ తేజ్ కొత్త అవతారం!”
Comments are closed.