మంత్రి సీతక్కకు నోట్ల కట్ట ఇచ్చిన కోమటిరెడ్డి ?

రక్షాబంధన్ పండుగ సందర్భంగా మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ముందుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసానికి వెళ్ళి ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనకు కూడా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కకు కానుకగా నోట్ల కట్టను అందించారు. ఆమె వద్దని వారించినా “తీసుకో” అంటూ ఆ నోట్ల కట్టను ఆమె చేతిలో పెట్టారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Read More : రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి