పహెల్‌గామ్ ఉగ్రదాడిలో తెలుగు పర్యాటకుడు మృతి..

జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహెల్‌గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృత్యువాత పడ్డారు. దాడి సమయంలో పారిపోతున్న చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంబడించి దగ్గర నుంచి కాల్చి చంపినట్లు సమాచారం. ఆయన ప్రాణాల కోసం వేడుకున్నా ఉగ్రవాదులు వినిపించుకోకుండా ఈ హృదయ విదారక ఘాతుకానికి పాల్పడ్డారు.

చంద్రమౌళి మృతదేహాన్ని అతనితో పాటు ప్రయాణించిన టూరిస్టులు గుర్తించారు. ఈ విషాదకర సమాచారం తెలుసుకున్న వెంటనే విశాఖపట్నం నుంచి ఆయన కుటుంబసభ్యులు పహెల్‌గామ్‌కు బయలుదేరారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇంకా 20 మందికి పైగా తీవ్ర గాయాలవుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Read More : ప్రధాని మోదీ అమిత్ షాకు ఫోన్ చేశారు.

One thought on “పహెల్‌గామ్ ఉగ్రదాడిలో తెలుగు పర్యాటకుడు మృతి..

Comments are closed.