నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు కొత్త ఛార్జీలు

నవీ ముంబయిలో త్వరలో ప్రారంభమయ్యే అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణించే వారు ఇకపై వినియోగదారుల అభివృద్ధి ఫీజు (యూజర్ డెవలప్‌మెంట్ ఫీ – UDF) చెల్లించాల్సి ఉంటుంది.

ఇది దేశీయ ప్రయాణికుల కోసం రూ.620గా, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం రూ.1,225గా నిర్ణయించారు. ఈ కొత్త ఛార్జీలు విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత నుంచి అమల్లోకి రానున్నాయి.

ప్రయాణదారులకు మెరుగైన వసతులు, సేవలు అందించేందుకు ఈ ఫీజు వసూలు చేయనున్నారు.

Read More : కాంగ్రెస్ నేత శశిథరూర్‌ వ్యాఖ్యలపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు.