ముంబై నగరంలో నేడు తీవ్రమైన కలకలం రేగింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ప్రసిద్ధ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్కి బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలియడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తత ఏర్పడింది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఈ రెండు ప్రాంతాల్లో శక్తివంతమైన పేలుళ్లు జరగబోతాయని ఒక ఈ-మెయిల్ పోలీసులకు అందింది. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహా పోలీసులు క్షుణ్ణమైన తనిఖీలు ప్రారంభించారు.
గంటల తరబడి పరిశీలన చేసిన అనంతరం ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు కనబడలేదు. విమానాశ్రయ పోలీసులు ఈ బెదిరింపు ఈ-మెయిల్ నకిలీగా నిర్ధారించారు. ప్రజలను భయపెట్టేందుకు అలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఈ-మెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ ఘటన కారణంగా మొదట ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, తనిఖీల తర్వాత పరిస్థితి సవ్యంగా ఉందని వెల్లడించడంతో ప్రయాణికులు, హోటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Read More : మానవత్వం చాటుకున్న సైనికులు…

One thought on “తాజ్ హోటల్, విమానాశ్రయంలో భద్రతా సడలింపు.”
Comments are closed.