మీరట్‌లో దారుణం: భర్తను హత్య చేసి పాము కాటుగా నాటకం ఆడిన భార్య!

మీరట్‌ లో మానవత్వాన్ని శూన్యమయ్యేలా చేసిన ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య తన భర్తను హత్య చేసి, ఆ హత్యను సహజ మరణంలా చూపించేందుకు షాకింగ్ ప్లాన్ వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

పోలీసుల వివరాల ప్రకారం — భర్తను హత్య చేసిన భార్య, దాన్ని పాము కాటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. భర్త బెడ్‌పై నిద్రపోతున్న సమయంలో పాము కొట్టినట్లు ఆమె నాటకం ఆడింది. అంతేకాదు, భర్తను పదే పదే పాము కొట్టినట్లు చెప్పి అందరినీ మోసం చేయాలని ప్రయత్నించింది. ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో — “రాత్రి పాము ఇంట్లోకి వచ్చింది, బెడ్‌పై నిద్రపోతున్న భర్తను పదిమార్లు కాటేసింది” అంటూ డబ్బా వేసింది.

అయితే పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక అసలు నిజం బయటపడింది. మృతదేహంపై పాము కాటు లక్షణాలు లేవని స్పష్టమవ్వడంతో పోలీసులు ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. విచారణను లోతుగా చేయగా, తన భర్తను అతి జాగ్రత్తగా హత్య చేసినట్టు ఆమె కుట్ర బట్టబయలైంది.

ఈ సంఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు, నిందితురాలి మోటివ్ ఏమిటో త్వరలో వెల్లడి చేస్తామని తెలిపారు. భర్తను హత్య చేసి పాము కాటుగా భ్రమింపజేసే ప్రయత్నం చేసిన ఈ దారుణం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read More : ఫాస్టాగ్ అవసరం లేకుండా!

One thought on “మీరట్‌లో దారుణం: భర్తను హత్య చేసి పాము కాటుగా నాటకం ఆడిన భార్య!

Comments are closed.