టాలీవుడ్లో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం తెరపైకి వచ్చింది. ఆస్తుల వివాదాలతో గత కొన్ని నెలలుగా మంటలేర్చిన మంచు కుటుంబ కలహాలు ఇప్పుడు మళ్లీ వేడెక్కాయి. ఈసారి మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్లిన మనోజ్, తన ఇంట్లోని విలువైన కార్లు, వస్తువులు విష్ణు తీసుకెళ్లారంటూ సీసీ ఫుటేజ్తో పాటు ఆధారాలతో ఫిర్యాదు చేశారు.
తాను రాజస్థాన్ వెళ్లిన సమయంలో, జల్పల్లిలోని తన ఇంటిలోకి సుమారు 150మంది చొరబడి, కొన్ని కార్లు, ఖరీదైన వస్తువులు తీసుకెళ్లారని మనోజ్ ఆరోపించారు. గోడల దూకి ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా, కొంతమందికి వస్తువులను ధ్వంసం చేశారంటూ ఆయన పోలీసులకు వివరించారు. ఈ ఘటనపై స్పందించిన మనోజ్—తన తండ్రి మోహన్బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన అందుబాటులోకి రాలేదని అన్నారు. తాను న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని వాపోయారు.
ఇదిలా ఉండగా, గత ఏడాది చివరి నుంచి మంచు ఫ్యామిలీలోని ఆస్తుల వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేసిన మనోజ్—ఇప్పుడు మళ్లీ విష్ణుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో ఇద్దరికి న్యూసెన్స్ మానాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా, ఇప్పుడు మళ్లీ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు చేరినట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై మంచు విష్ణు ఎలా స్పందిస్తారో, ఈ కుటుంబ కలహాలు ఎక్కడి వరకు వెళ్తాయో అన్నది సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

One thought on “మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ: విష్ణుపై మనోజ్ పోలీస్ ఫిర్యాదు”
Comments are closed.