స్వాతంత్ర్య దినోత్సవానికి గోల్కొండలో భారీ ఏర్పాట్లు

రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట సిద్దమవుతోంది. ఈ నెల 15న జరగనున్న వేడుకల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భాగంగా, నేడు గోల్కొండ కోటలో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా హాజరై రిహార్సల్స్‌ను పర్యవేక్షించారు. అనంతరం, వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read More : వరదల బాధితులకు అండగా నిలవండి: కేటీఆర్