హైదరాబాద్లో సంచలనంగా మారిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు పెద్దఎత్తున అరెస్టులు చేశారు. అహ్మదాబాద్కు చెందిన వందన అనే మహిళ తన ముఠాతో కలిసి చిన్నారులను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా ఆస్పత్రులు, రోడ్లపై చెత్త ఏరుకునే పిల్లలపై కన్నేసి వారిని అపహరించడం, అలాగే పేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రుల వద్ద నుంచి చిన్నారులను రూ.2.5 లక్షల నుండి రూ.3.5 లక్షల మధ్య ధరలకు కొనుగోలు చేయడం, అనంతరం పిల్లలు లేని దంపతులకు ఒక్కో చిన్నారిని రూ.5 లక్షలకు విక్రయించడం వంటి తీవ్రమైన అక్రమ కార్యకలాపాల్లో లీనమై ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ కేసులో ప్రధాన సూత్రధారి వందనతో పాటు మొత్తం 15 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ముఠా చాలా కాలంగా దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ నడిపిస్తూ, పేద పిల్లలను టార్గెట్ చేస్తున్నట్లు వెల్లడైంది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే సమయంలో, ప్రధాన నిందితురాలు వందనను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు అభ్యర్థించారు. మరిన్ని వివరాలు వెలుగు చూడనుండగా, ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించి మరికొందరు వ్యక్తుల ప్రమేయంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

One thought on “హైదరాబాద్లో భారీ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు.. 15 మంది అరెస్ట్”
Comments are closed.