తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, ఈరోజు ములుగు మరియు మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె ప్రజలకు కొన్ని సూచనలు చేశారు:
- భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలి.
- సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది.
- వాగులు, వంకల ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- భారీ వర్షాలు విలయం సృష్టించే అవకాశాలు ఉన్నందున, ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
Read More : తెలంగాణలో భారీ వర్షాలు, రహదారులు జలమయం
