సంగీత దర్శకుడు జీవి ప్రకాశ్ మరియు గాయని సైంధవి, 2024లో తమ వివాహం ముగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అభిప్రాయ బేధాల కారణంగా విడిపోతున్నట్లు వారు ఎప్పుడో ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు విడాకులు తీసుకోలేదు. ఆ తరువాత వారు మళ్లీ కలుస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా, సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఈ విషయంలో వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ పోస్ట్లు పెట్టారు.
తాజాగా, జీవి ప్రకాశ్ మరియు గాయని సైంధవి విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. చెన్నై ఫస్ట్ అడిషనల్ ఫ్యామిలీ కోర్టులో వారు విడాకుల కోసం అర్జీ పెట్టారు. కోర్టు ముందు రెండు సార్లు హాజరైన ఈ దంపతులు, ఇష్టపూర్వకంగానే విడిపోతున్నారని పేర్కొన్నారు.
కోర్టు తరువాత, విడాకులు వాయిదా వేసింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన తరువాత, ఇద్దరూ ఒకే కారులో కలిసి వెళ్ళారు.
గాయని సైంధవి, జీవి ప్రకాశ్ 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల పాప కూడా ఉంది. జీవి వృత్తిపరంగా మంచి ఫాంలో ఉన్నాడు. ఇటీవలే అమరన్ సినిమాతో మంచి విజయం సాధించిన ఆయన, ప్రస్తుతం కోలీవుడ్లో ఇడ్లీ కడై, పరాశక్తి చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. ఆయన తెలుగులోనూ రాబిన్ హుడ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు, ఈ చిత్రం ఈ వారంలో విడుదల కానుంది.

One thought on “జీవి ప్రకాశ్-సైంధవి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు!”
Comments are closed.