భారత్‌కు నీటి బాంబ్ ముప్పు – ఎంపీ టాపిర్ గావో హెచ్చరిక

తిబెట్‌లోని యార్లుంగ్ సంగ్‌పో నదిపై చైనా ప్రతిపాదించిన భారీ డ్యామ్ నిర్మాణం భారత్‌కి తీవ్రమైన భద్రతా ఆందోళన కలిగిస్తోందని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ టాపిర్ గావో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌కి వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో, దీని భౌగోళిక ప్రభావాన్ని సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

ఈ డ్యామ్ కేవలం సాధారణ జలవనరుల భద్రత కోసమే కాదు, అవసరమైతే “నీటి బాంబ్”గా కూడా దాన్ని వాడుకునే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇది శాంతి దృక్పథానికి వ్యతిరేకంగా ఉండే ప్రమాదముందని, కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గావో స్పష్టం చేశారు. చైనాతో జల ఒప్పందాలపైనా సమీక్ష అవసరమని సూచించారు.

హిమాలయ ప్రాంతంలో చైనా చేపడుతున్న డ్యామ్ ప్రాజెక్టులు భారత జల భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో వరద ముప్పు, పంట నష్టం, పీక్కాలంలో నీటి కొరత వంటి సమస్యలు తలెత్తే అవకాశముందన్నారు. యార్లుంగ్ సంగ్‌పోపై నిర్మించే మెగా డ్యామ్‌పై కఠినమైన వైఖరితో కేంద్రం ముందడుగు వేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Read More : గుజరాత్‌లో దుబాయ్ తరహా నగరం సిద్ధంగా…