ఛత్తీస్‌గఢ్‌లో గర్భిణీ ఆదివాసీ మహిళపై దారుణం…

ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఆదివాసీ మహిళకు త్రాస్టమైన అనుభవం ఎదురైంది. మంత్ర తంత్రం పేరిట ఆమెను మోసగించి, మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన గత సంవత్సరం చోటుచేసుకోగా, బాధితురాలు ఫిబ్రవరిలో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ విషయం బయట పెట్టింది. మంత్ర తంత్రం పేరుతో తనను మోసగించి, తనపై గ్యాంగ్ రేప్ చేసినట్లు ఆమె ఆరోపించింది. ఈ ఘటనలో నిందితులు ఆమెను మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. అత్యాచారం కారణంగా ఆమె గర్భవతి కావడంతో నిందితులు మౌనంగా ఉండాలని బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమెకు ధైర్యం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలి ఆరోపణల మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు మరింత దర్యాప్తు కోసం కోర్టుకు చేరింది.

Read More : కర్ణాటకలో వీరమరణం పొందిన ఓ పిట్‌బుల్ కుక్క.. కుటుంబాన్ని కర్ణాటకలోప్రాణత్యాగం

One thought on “ఛత్తీస్‌గఢ్‌లో గర్భిణీ ఆదివాసీ మహిళపై దారుణం…

Comments are closed.