డివిలియర్స్ మాస్టర్‌క్లాస్.. 12 ఓవర్లలో దక్షిణాఫ్రికా విజయం

దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్ ఛాంపియన్స్‌తో జరిగిన డబ్ల్యూసీఎల్ 2025 మ్యాచ్‌లో 153 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.2 ఓవర్లలోనే చేధించి తమ శక్తివంతమైన బ్యాటింగ్‌ను మరోసారి చూపించింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఏబీ డివిలియర్స్ ధాటివంతమైన ఆట. ఆయన కేవలం 51 బంతుల్లోనే 116 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ పాత జోష్‌ను గుర్తుచేశాడు. ఆయనతో పాటు హషీమ్ ఆమ్లా 25 బంతుల్లో 29 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం అందించాడు.

ప్రేక్షకులను అలరించిన ఈ జంట సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకోవడంతో మ్యాచ్ పూర్తిగా దక్షిణాఫ్రికా పక్షాన సాగింది. డివిలియర్స్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ను అభిమానులు “ఇప్పటికీ తన పాత ప్రైమ్‌లో ఉన్నట్టే ఆడుతున్నాడు” అంటూ ప్రశంసిస్తున్నారు.

ఈ విజయం దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ జట్టుకు టోర్నమెంట్‌లో మంచి ఉత్సాహాన్ని నింపింది.

Read More : భారత ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా జావీ దరఖాస్తు.. ?

One thought on “డివిలియర్స్ మాస్టర్‌క్లాస్.. 12 ఓవర్లలో దక్షిణాఫ్రికా విజయం

Comments are closed.