సొంత సామాజిక వర్గ నేతలనే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) టార్గెట్ (Target) చేస్తుండడంపై వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి అక్రమ కేసులతో అరెస్టైన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని విజయవాడ సబ్ జైల్లో (Vijayawada Sub Jail) మంగళవారం పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో (Media) మాట్లాడారు.
వల్లభనేని వంశీని (Vallabhaneni Vamsi) చంద్రబాబు టార్గెట్ చేయడం వెనుక కారణం ఉంది. తన సామాజిక వర్గానికి (Social Class) చెందిన వంశీ (Vamsi) ఎదుగుదలను చంద్రబాబు సహించలేకపోయారు. అందుకే తప్పుడు కేసులు (False Cases) పెట్టారు. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలి. లేకుంటే.. వెలివేస్తారు. కుదిరితే ఇలా కేసులతో ఇబ్బంది పెడతారు. అదీ చంద్రబాబు మనస్తతత్వం (Mindset).
Our YouTube Channel Click Here
