భారత్తో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐదు టెస్టుల సిరీస్కు సంబంధించి తొలి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టును గురువారం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది. 14 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 20వ తేదీ నుంచి లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరగనుంది.
గాయం కారణంగా జట్టుకు దూరమైన గస్ అట్కిన్సన్ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జామీ ఓవర్టన్కు చోటు దక్కింది. అతడు 2022లో న్యూజిలాండ్తో తన ఏకైక టెస్టులో 97 పరుగులతో పాటు రెండు వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఇంగ్లండ్కు కీలక ఆటగాడిగా నిలుస్తున్నాడు.
జట్టులో అనుభవజ్ఞులైన జో రూట్, జాక్ క్రాలీ, ఓలీ పోప్ లాంటి ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులైన షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్లకు అవకాశం ఇవ్వడం ద్వారా జట్టు అనుభవం, యూత్ కాంబినేషన్తో సమతూకంగా రూపొందినట్లు తెలుస్తోంది. 21 ఏళ్ల బెథెల్ ఇటీవల ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మంచి ఆటతీరు కనబరిచాడు. అంతకుముందు న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో మూడు అర్ధశతకాలు సాధించాడు.
పేస్ విభాగంలో క్రిస్ వోక్స్, జోష్ టంగ్ కీలక పాత్ర పోషించనుండగా, గాయాల నుంచి కోలుకున్న సామ్ కుక్, బ్రైడన్ కార్స్ అదనపు బలంగా నిలవనున్నారు. వోక్స్, కార్స్ రెండువారాల క్రితం గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు.
ఇక ఈ సిరీస్ 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరుగుతోంది. మరోవైపు భారత టెస్ట్ జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా, రిషభ్ పంత్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
తొలి టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టు సభ్యులు ఇలా ఉన్నాయి:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.
Read More : హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్

One thought on “ఇంగ్లండ్ vs భారత్ తొలి టెస్ట్కు జట్టు ప్రకటించిన ఈసీబీ.”
Comments are closed.