టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్థాపించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ మంగళవారం సాయంత్రం తన అధికారిక ‘ఎక్స్’ (పూర్వం ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికర పోస్టును షేర్ చేసింది. “బోల్డ్… బిగ్… బియాండ్ ఇమాజినేషన్” అంటూ పోస్ట్ చేయడం ద్వారా ప్రేక్షకులలో ఉత్సుకతను రేకెత్తించింది. ఈ పోస్టును అనుసరించి, బుధవారం ఉదయం 11:08 గంటలకు ఎస్వీసీ కీలక ప్రకటన విడుదల చేయడం విశేషం.
ఈ ప్రకటనలో, దిల్ రాజు ఏఐ ఆధారిత టెక్నాలజీ కంపెనీ క్వాంటమ్ ఏఐ గ్లోబల్తో కలిసి పనిచేస్తూ ఓ వినూత్న సంస్థను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంస్థను “ఏఐ స్టూడియో”గా అభివర్ణించారు. ఇది పూర్తిగా వినోద పరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల అభివృద్ధిపై దృష్టి సారించనుంది. చిత్ర పరిశ్రమకు సంబంధించి డిజిటల్ మార్గంలో పరిణామాన్ని అందించేందుకు ఇది కీలకంగా మారనున్నదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ పెద్ద ప్రకటనతో పాటు, భారతీయ సినిమా పరిణామక్రమాన్ని చాటేలా రూపొందించిన ఓ ప్రత్యేక వీడియోను దిల్ రాజు షేర్ చేశారు. స్టూడియో పేరుతో సహా మరిన్ని ఆసక్తికర వివరాలను మే 4న అధికారికంగా ప్రకటించనున్నట్లు ఎస్వీసీ వెల్లడించింది. ఈ తాజా ముందడుగు టాలీవుడ్లో టెక్నాలజీ ప్రాధాన్యాన్ని మరింతగా ఉద్దీపింపజేయనుంది.
He started with a vision.
— Sri Venkateswara Creations (@SVC_official) April 16, 2025
He gave us unforgettable stories.
Now, he’s building something beyond cinema.
Our blockbuster producer #DilRaju collaborates with the brilliant minds at @QuantumAIGlobal to launch an AI-powered media company 💥
— https://t.co/6q9grVKCQv
A space… pic.twitter.com/R7R7tQSYWN

One thought on “దిల్ రాజు భారీ అడుగు: టాలీవుడ్లోకి ఏఐ స్టూడియో!”
Comments are closed.