ఐపీఎల్ 2025 సీజన్లో ఓ ప్రత్యేక సందేశాన్ని అభిమానులకు చేరవేయడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి గ్రీన్ జెర్సీ ధరించబోతోంది. ఈ నెల 13వ తేదీన జరగనున్న రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో RCB సరికొత్త గ్రీన్ జెర్సీలో మైదానంలోకి దిగనుంది. ప్రతి ఏడాది పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే ఉద్దేశంతో బెంగళూరు జట్టు ఈ గ్రీన్ జెర్సీ ప్రత్యేకంగా ధరిస్తూ, పర్యావరణ హితమైన సంస్కృతిని ప్రోత్సహిస్తోంది.
పర్యావరణ పరిరక్షణ, సస్టైనబిలిటీకి మద్దతుగా RCB తీసుకుంటున్న ఈ కార్యక్రమం అభిమానుల నుండి విశేష స్పందనను సొంతం చేసుకుంటోంది. కేవలం క్రీడను మాత్రమే కాకుండా, సమాజానికి అవగాహన కల్పించాలన్న దృక్పథంతోనే RCB ఈ గ్రీన్ అనుభవాన్ని మరోసారి అందించనుంది. పర్యావరణాన్ని కాపాడే అవసరాన్ని గుర్తు చేస్తూ, ఈ ప్రత్యేక మ్యాచ్లో RCB ఆటగాళ్లు సంప్రదాయ రెడ్ అండ్ బ్లాక్ జెర్సీకి బదులుగా గ్రీన్ జెర్సీ ధరించి బరిలోకి దిగనున్నారు.
Read More : ఐపీఎల్ 2025: చెపాక్ స్టేడియంలో నేడు సిఎస్కె vs కేకేఆర్ హైవోల్టేజ్ మ్యాచ్
