చియాన్‌ విక్రం బోల్డ్‌ డెసిషన్‌ – ముందుగా ‘వీర ధీర శూర’ పార్ట్‌ 2 రిలీజ్!

Chiyaan Vikram

సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకుల అభిరుచులు మారిపోతున్నాయి. కొత్త కంటెంట్‌ లేకుంటే ఆడియన్స్‌ ఆకర్షితులు కావడం లేదు. దీనిని అర్థం చేసుకున్న ఫిల్మ్ మేకర్స్‌ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు, ప్రత్యేకంగా స్టార్ హీరోల సినిమాల్లో కొత్త కాన్సెప్ట్‌లు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల ‘బాహుబలి’తో రెండు పార్ట్‌లుగా సినిమాలు రూపొందించాలనే ట్రెండ్‌ ప్రారంభమైంది. రాజమౌళి ‘బాహుబలి 1, 2’ సినిమాలకు రెండేళ్ల గ్యాప్‌ ఇచ్చి తెరకెక్కించగా, కన్నడ స్టార్‌ రక్షిత్‌ శెట్టి ‘సప్త సాగరాలు దాటి’ రెండు భాగాలుగా రూపొందించి ఏడాది లోపే విడుదల చేశాడు. ఇక ఇప్పుడు చియాన్‌ విక్రం మరో ముందడుగు వేసి, అందరూ ఊహించని ప్రయోగం చేయబోతున్నాడు.

సాధారణంగా సినిమాల మొదటి భాగం విడుదలైన తర్వాతే రెండో భాగాన్ని రిలీజ్‌ చేస్తారు. అయితే చియాన్‌ విక్రం ‘వీర ధీర శూర’తో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా రెండో భాగాన్ని ముందుగా విడుదల చేయబోతున్నారు. మార్చి 27న రాబోయే ఈ చిత్రానికి అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.

తొలి సినిమా ‘పరియేరుం పెరుమాళ్‌’తో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు అరుణ్‌ కుమార్‌, ఆ తర్వాత ‘సేతుపతి’, ‘సింధుబాద్‌’ సినిమాలతో ఆకట్టుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం సిద్ధార్థ్‌ నటించిన ‘చిన్నా’ సినిమాతో ప్రశంసలు అందుకున్న ఆయన, ఇప్పుడు చియాన్‌ విక్రంతో కలిసి పని చేయడం విశేషం.

‘వీర ధీర శూర’ చిత్రంలో ఎస్‌ జె సూర్య కీలక పాత్రలో నటించాడు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నా, ఇప్పటికీ ప్రమోషన్స్‌ మొదలుకాలేదు. అయితే ముందుగా పార్ట్‌ 2 రిలీజ్‌ చేసి, ఆ తర్వాత పార్ట్‌ 1 షూటింగ్‌ పూర్తి చేయాలనే నిర్ణయం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా హిట్‌ అయితే భవిష్యత్తులో మరికొందరు ఫిల్మ్‌మేకర్స్‌ ఇలాంటి ప్రయోగాలు చేసే అవకాశముంది.

చియాన్‌ విక్రం ‘తంగలాన్‌’తో మిశ్రమ స్పందన అందుకున్నాడు. మరి ‘వీర ధీర శూర’తో విజయం సాధించగలడా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశం!

Read More

One thought on “చియాన్‌ విక్రం బోల్డ్‌ డెసిషన్‌ – ముందుగా ‘వీర ధీర శూర’ పార్ట్‌ 2 రిలీజ్!

Comments are closed.