సూపర్ స్టార్ మహేష్ బాబు భారతీయ సినిమా రంగంలో అత్యంత ఆదరణ పొందిన నటుల్లో ఒకరు. అయితే, ఒక సందర్భంలో ఆయన బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్పై తన అభిప్రాయాన్ని వెల్లడించి, ఫ్యాన్బాయ్ మోమెంట్ను గుర్తుచేసుకున్నారు.
2023లో హైదరాబాద్లోని మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్లో మహేష్ బాబును అభిమానులు రణబీర్ కపూర్ గురించి ప్రశ్నించారు.
దీనికి మహేష్ బాబు తన అనుభవాన్ని పంచుకుంటూ, రణబీర్తో తనకు జరిగిన ప్రత్యేక సంభాషణ గురించి వివరించారు. అయితే, మహేష్ చెప్పిన మాటలను రణబీర్ అంత సీరియస్గా తీసుకోలేదని ఆయన ముచ్చటగా చెప్పారు.
మహేష్ బాబు మాట్లాడుతూ, “నేను రణబీర్ కపూర్కు ఇది ముందుగా చెప్పాను. అయితే, ఆయన అది అంతగా నమ్మలేదు. అందుకే, ఈ స్టేజ్పై మరోసారి చెప్తున్నా… నేను అతనికి పెద్ద అభిమానిని. నా అభిప్రాయంలో, రణబీర్ కపూర్ భారతదేశంలో అత్యుత్తమ నటుడు.” అని అన్నారు.
క్రేజీ ప్రాజెక్ట్ SSMB29 కోసం మహేష్ బాబు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళితో కలిసి పనిచేస్తున్నారు. ఈ గ్లోబ్-ట్రోటింగ్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఒడిశాలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇక రణబీర్ కపూర్ విషయానికి వస్తే, ఆయన సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

One thought on “మహేష్ బాబు, రణబీర్ కపూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!”
Comments are closed.