క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ రసవత్తర పోరును జియో హాట్స్టార్ వేదికగా 90.2 కోట్లు మంది వీక్షించారు.
ఈ వ్యూస్ రికార్డు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ నమోదు కాని స్థాయిలో ఉంది. క్రికెట్ అభిమానులు మైదానంలో చోటుచేసుకున్న ప్రతి ఒక్క క్షణాన్ని ఆసక్తిగా వీక్షించారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ చివరి వరకు అభిమానులను ఉర్రూతలూగించింది. భారత్-న్యూజిలాండ్ పోరు క్రికెట్ ప్రేమికులకు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందని నిపుణులు పేర్కొంటున్నారు.
జియో హాట్స్టార్ వేదికగా ఒకే మ్యాచ్కు 90.2 కోట్లు వ్యూస్ రావడం భారతదేశంలో డిజిటల్ వ్యూయర్షిప్ పెరుగుదలకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు ఫైనల్కు చేరడం, మ్యాచ్లో ఉత్కంఠత ఎక్కువగా ఉండటమే ఈ భారీ వ్యూయర్షిప్కు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.

One thought on “ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్కు రికార్డు వ్యూస్”
Comments are closed.