శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్‌ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ కూతురు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) తిరుమల శ్రీవారిని(TTD) దర్శించుకున్నారు. తనతో పాటు తన చిన్న కూతురు పలీనా అంజని కొణిదెలను(Palina anjani konidela) కూడా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అందుకోసం ఆమె డిక్లరేషన్(Declaration) ఇవ్వడం గమనార్హం. క్రిస్టియన్‌(Christian) కాబట్టి టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. కొసమెరుపు ఏమిటంటే పలీనా అంజని మైనర్‌ కావడంతో తండ్రిగా పవన్‌ కల్యాణ్‌ ఆ పత్రాలపై సంతకాలు చేయడం! చిత్రంగా ఉంది కదూ!