రాజస్థాన్‌లో హోటల్‌ క్రికెట్‌ స్టేడియం.. త్వరలో ప్రారంభం..!

రాజస్థాన్‌లో(Rajasthan) అధునాతన క్రికెట్‌ స్టేడియం(Cricket stadium), దాంతో పాటు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌(5 Star hotel) అతి త్వరలోనే ప్రారంభం కానుంది.

రాజస్థాన్‌లో(Rajasthan) అధునాతన క్రికెట్‌ స్టేడియం(Cricket stadium), దాంతో పాటు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌(5 Star hotel) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మిరాజ్ గ్రూప్(Miraj group) 2025లో భారతదేశంలో మొట్టమొదటి విలాసవంతమైన క్రికెట్ స్టేడియం హోటల్‌ను ప్రారంభించనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారతదేశపు అతిపెద్ద క్రికెట్ స్టేడియం హోటల్‌గా నిలుస్తుంది. ప్రపంచ స్థాయి ఆతిథ్యం, లైవ్ క్రికెట్‌ను చూసేందుకు వీలుగా దీనిని నిర్మించారు.. 234 ఆధునాతన గదులు ఏర్పాటు చేశారు. ఈ గదుల్లో 75% గదుల నుంచి క్రికెట్‌ను వీక్షించే అవకాశం ఉంది. అతిథులు తమ గదుల్లో కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదించే అవకాశం ఉంది. అధునాతనత, క్రీడా ఉత్సాహాన్ని మిళితం చేసే రాడిసన్ హోటల్స్‌తో కలిసి మదన్ పలివాల్ పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తూనే రాజస్థాన్ శోభను ఇది పతాకస్థాయికి చేర్చుతుంది. హోటల్ డిజైన్, విలాసవంతమైన సౌకర్యాలు కల్పించి వీవీఐపీ అతిథుల కోసం అధునాతనంగా తీర్చిదిద్దారు. క్రికెట్‌ను వీక్షించేందుకే కాకుండా ఈ హోటల్‌లో బస చేస్తే చక్కటి భోజన, వెల్నెస్ సౌకర్యాలు కల్పించారు. అతి త్వరలోనే ఈ హోటల్‌ క్రికెట్‌ స్టేడియం ప్రారంభంకానుంది.