మంచు వివాదం: మంచు మనోజ్ మాట్లాడితే కేసు.. కోర్టు సంచలన నిర్ణయం
మంచు కుటుంబంలో కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు సంచలన తీర్పును ప్రకటించింది.
మంచు కుటుంబ వివాదంలో నటుడు మంచు మనోజ్పై హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వులు మంజూరు చేసింది. యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో విష్ణు మంచు గురించి పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయడం నిషేధించామని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మంచు కుటుంబంలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో మంచు మనోజ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో అది విష్ణు మంచు పట్ల అపహాస్యం మరియు అతని ప్రతిష్టకు హానిగా మారిందని, విష్ణు పబ్లిక్ ఇమేజ్ను దెబ్బతీసేలా మాట్లాడారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. విష్ణు సమర్పించిన సాక్ష్యాలను సమీక్షించిన అనంతరం కోర్టు అతని వ్యక్తిగత సమగ్రతను దృష్టిలో ఉంచుకొని, విష్ణు మంచు ప్రతిష్టను హానికరం చేసే వ్యాఖ్యలను నిరోధించేందుకు తీర్పును ఇచ్చింది.
మరోవైపు, మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. హత్యాయత్నం కేసులో సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని కోరుతూ మోహన్ బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. మోహన్ బాబు హైకోర్టులో ఉన్నారు అనే విషయాన్ని అఫిడవిట్లో దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
