యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వాణీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా థియేటర్లలో ఆల్టైమ్ యాక్షన్ బ్లాక్బస్టర్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
సమకాలీన యాక్షన్ సినిమాల్లో మైల్స్ టోన్గా నిలవబోతున్న ‘వార్ 2’లో హృతిక్, ఎన్టీఆర్ మాస్ అప్పీల్ ఓ రేంజ్లో ఉండబోతుందట. యశ్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ఈ సినిమాపై “థియేటర్లలో మేహమ్ సృష్టించబోతోంది” అంటూ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇదివరకే ఫస్ట్ పార్ట్ ‘వార్’ (2019) ఘనవిజయం సాధించగా, దానికి మించిన యాక్షన్, ఇంటెన్స్ స్టోరీ, గ్రాండ్ విజువల్స్తో సీక్వెల్ రాబోతుందని సమాచారం.
ఇక హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయని టాక్. హృతిక్ పాత్రకు సంబంధించి ఓ ఖడ్గయుద్ధ సీక్వెన్స్ హైలైట్ కానుందట. అయితే, ఇటీవల ఆయన డాన్స్ రిహార్సల్స్లో చిన్న గాయం అయిందని, కొంతకాలం రెస్ట్ తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ‘వార్ 2’లో ఎన్టీఆర్ పాత్ర ఎంతో కీలకమైనదని, హిందీ మార్కెట్లోనూ ఆయన స్థాయిని మరింత పెంచేలా ఉంటుందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘వార్ 2’ హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా దూసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.


One thought on “వార్ 2: థియేటర్లలో సందడి చేయనున్న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వాణీ సినిమా – యాష్ రాజ్ ఫిల్మ్స్ గ్యారంటీ!”
Comments are closed.