కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామంలో బర్త్డే వేడుకలు ఉద్రిక్తతకు దారితీసాయి. గ్రామంలోని టీడీపీ నాయకుడి కొడుకు పుట్టినరోజు వేడుకలో జనసేన నాయకులు హాజరవగా, వేడుకలకు ఎవరూ పిలవలేదంటూ టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేశాయి.
ఈ వివాదం కాస్త వేడెక్కి, ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నుంచి పరస్పర దాడులకు దారి తీసింది. “ఫంక్షన్కు పిలిచి మరీ కొడతారా?” అంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Read More : ఏపీలో 3 రోజులు తేలికపాటి వర్షాలు: పిడుగులు పడే అవకాశాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు

One thought on “బర్త్డే వేడుకల్లో ఘర్షణ — జనసైనికులపై టీడీపీ కార్యకర్తల దాడి..”
Comments are closed.