స్మార్ట్ఫోన్ యూజర్లకు శుభవార్త. ప్రముఖ టెక్ సంస్థ Samsung తన కొత్త ఆపరేటింగ్ సిస్టం One UI 7 అధికారికంగా ఏప్రిల్ 7, 2025 నుంచి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అప్డేట్లో AI ఆధారిత ఫీచర్లు, కొత్తగా డిజైన్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్, అలాగే కస్టమైజేషన్కి మరిన్ని ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
మొదట ఈ అప్డేట్ గెలాక్సీ S, గెలాక్సీ Z, మరియు గెలాక్సీ Tab S సిరీస్లకు అందుబాటులోకి రానుంది. అనంతరం మరిన్ని గెలాక్సీ డివైసులకు కూడా ఈ అప్డేట్ అందించనున్నారు.
One UI 7 అప్డేట్ అందుకునే మొదటి బ్యాచ్ డివైసులు:
Galaxy S Series
Galaxy S24
Galaxy S24 FE
Galaxy S23
Galaxy S23 FE
Galaxy Z Series
Galaxy Z Fold6
Galaxy Z Flip6
Galaxy Z Fold5
Galaxy Z Flip5
Galaxy Tab S Series
Galaxy Tab S10
Galaxy Tab S9
ఈ అప్డేట్ ద్వారా వినియోగదారులకు మరింత స్మార్ట్, AI ఆధారిత, పెర్సనలైజ్డ్ మొబైల్ అనుభవం లభించనుంది. కొత్త ఇంటర్ఫేస్ డిజైన్తో పాటు పనితీరు, ప్రైవసీ, నోటిఫికేషన్ లాంటి అంశాల్లోనూ మెరుగుదలలు ఉంటాయి.
Read More : iPhone ధరలు పెరిగే అవకాశం..
