పారిస్‌లో AI యాక్షన్ సదస్సు ప్రారంభించిన ప్రధాని మోదీ

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో AI యాక్షన్‌ సమ్మిట్‌ను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ప్రారంభించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, AI టెక్నాలజీని మిగతా టెక్నాలజీలతో పోలిస్తే భిన్నంగా పనిచేస్తుందని చెప్పారు. AI టెక్నాలజీ ప్రపంచాన్ని వేగంగా అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రజల జీవితాల్లో AI ప్రభావం పెరిగిపోతుంది అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సదస్సుకు మోదీ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ టెక్‌ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిస్‌లో జరిగిన AI యాక్షన్‌ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ, AI మానవాళికి చాలా ఉపయోగకరమైన టెక్నాలజీ అని, ఈ శతాబ్దంలో AI కోడ్‌ను మనకు అందిస్తున్నదని చెప్పారు. AI టెక్నాలజీ మన ఆర్థిక వ్యవస్థ, భద్రత మరియు సమాజాన్ని పునర్నిర్మిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. AIకు సంబంధించి, పక్షపాతం లేకుండా నాణ్యమైన డేటా సెంటర్లను నిర్మించడానికి, టెక్నాలజీని ప్రజాస్వామ్యీకరించడంపై ప్రాధాన్యత ఇచ్చారు. AI సానుకూల సామర్థ్యం అద్భుతమైనదని, కానీ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అనేక పక్షపాతాలు ఉన్నాయని మోదీ అన్నారు.

Read more