ఎస్ఎస్ఎంబీ 29పై ఒడిశా డిప్యూటీ సీఎం కామెంట్స్!

Deputy CM

సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతుండగా, తాజాగా ఒడిశా డిప్యూటీ సీఎం ప్రదీప్ అమాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా కథాంశం ఒడిశా చరిత్ర, సంస్కృతి, గొప్ప వీరులను ఆధారంగా చేసుకుని రూపొందుతుందన్న వార్తల నేపథ్యంలో, ఒడిశా ప్రభుత్వ అధికారిక ప్రతినిధిగా ప్రదీప్ అమాత స్పందించారు.

“రాజమౌళి సినిమాలు ఎప్పుడూ విజువల్ వండర్‌గా ఉంటాయి. మా రాష్ట్ర నేపథ్యంతో ఒక గొప్ప సినిమా వస్తే, అది ఒడిశాకు గౌరవంగా ఉంటుంది” అంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తవగా, ఈ ఏడాది చివరిలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మహేశ్ బాబు ఈ చిత్రంలో పూర్తి భిన్నమైన లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

Read More

One thought on “ఎస్ఎస్ఎంబీ 29పై ఒడిశా డిప్యూటీ సీఎం కామెంట్స్!

Comments are closed.