రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా 2025 సీజన్‌ను గోల్డ్ మెడల్‌తో ప్రారంభం

రెండుసార్లు ఒలింపిక్ పతకం విజేత అయిన నీరజ్ చోప్రా 2025 సీజన్‌ను దక్షిణాఫ్రికాలోని పొట్చెఫ్‌స్ట్రూమ్‌లో జరిగిన ఆహ్వానిత ఈవెంట్లో అద్భుత విజయంతో ప్రారంభించారు. 16 ఏప్రిల్, బుధవారం జరిగిన పోటీలో 6 మంది పోటీదారులను ఓడించి గోల్డ్ మెడల్ సాధించారు.

84.52 మీటర్ల అత్యుత్తమ విసిరిన నీరజ్ చోప్రా, సీజన్‌ను పూర్తి విశ్వసనీయతతో ప్రారంభించారు. 25 ఏళ్ల దక్షిణాఫ్రికా జావెలిన్ థ్రోవర్ డౌ స్మిట్‌ను ని ఓడించి విజయం సాధించారు. 2025 క్యాంపెయిన్‌లో నీరజ్ మంచి ఫార్మ్‌లో ఉండడం కనిపించింది.

Read More : ఐపీఎల్‌లో తెలుగు సినిమా హంగామా..!