ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) మార్చి 12న చేసిన ప్రకటనలో వ్యాపారాలు, వ్యాపారవేత్తలు తమ ఉద్యోగులను మానవీయంగా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఆయన అభిప్రాయమేమిటంటే.. ఉద్యోగులు ఏ సంస్థ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి, వారి శ్రమకు తగిన గౌరవం ఇవ్వడం ముఖ్యం.
అంతేకాకుండా, సంస్థలో కనిష్ట వేతనదారుల నుంచి గరిష్ట వేతనదారుల వరకు ఉండే వేతన వ్యత్యాసాన్ని తగ్గించుకోవడం చాలా అవసరమని నారాయణ మూర్తి సూచించారు. ఈ విధంగా సమన్వయం నెలకొల్పితే ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సంస్థ పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగులు సంస్థ విజయానికి మూలస్తంభాలని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. అందువల్ల వారి సంక్షేమం, సమతుల్య వేతన విధానం వంటి అంశాలపై ప్రతీ వ్యాపారవేత్త ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.

One thought on “ఉద్యోగులను మానవీయంగా చూడాలి, వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలి: నారాయణ మూర్తి సూచన”
Comments are closed.