ప్రియాంక చోప్రాకు కృతజ్ఞతలు తెలిపిన నమ్రత శిరోద్కర్!

Namrata Shirodkar meets Nick Jonas with kids Gautam and Sitara

మహేష్ బాబు సతీమణి, మాజీ నటి నమ్రత శిరోద్కర్ ఇటీవ‌ల తన పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను కలిసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “అద్భుతమైన షోకి నిక్ జొనాస్, ప్రియాంక చోప్రా జొనాస్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు!” అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

ఇటీవ‌ల మహేష్ బాబు కుటుంబం ఇటలీలో విహార యాత్ర చేశారని వార్తలొచ్చాయి. ఆ ట్రిప్ సందర్భంగా నమ్రత, సితార కలిసి తెల్ల దుస్తుల్లో ట్విన్నింగ్ లుక్ లో కనిపించారు. మొదట గౌతమ్ వారి ట్రిప్‌లో లేనిప్పటికీ, తరువాత కుటుంబంతో జాయిన్ అయ్యాడు.

ప్రస్తుతం మహేష్ బాబు ‘SSMB29’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక అడవి ఆధారిత యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. ఇందులో ప్రియాంక చోప్రా జొనాస్ కథానాయికగా నటించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ భారీ ప్రాజెక్టు రూ.900–1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. మొదట రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచన ఉన్నా, ఆ భావనను విరమించి 2027లో ఒకే భాగంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. షూటింగ్ పూర్తయ్యే వరకు 2026 చివరి వరకూ షూటింగ్ కొనసాగనుంది.

Read More


One thought on “ప్రియాంక చోప్రాకు కృతజ్ఞతలు తెలిపిన నమ్రత శిరోద్కర్!

Comments are closed.