లక్ష్మీ మంచు ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిన విషయంపై ఆసక్తికరంగా స్పందించింది. ఇటీవల తన సోషియల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడి చేస్తూ, “నాకు డబ్బు అవసరమైతే నేను నేరుగా అడుగుతాను.. సోషల్ మీడియా ద్వారా కాదు” అంటూ లక్ష్మీ మంచు వినోదాత్మక స్పందన ఇచ్చింది. ప్రస్తుతం తన అకౌంట్ ను తిరిగి పొందే పనిలో ఉందని కూడా లక్ష్మీ తెలిపింది.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా స్కామర్లు ఆమె పేరుతో మోసం చేసే ప్రయత్నం చేసినట్లు లక్ష్మీ వివరించింది. ట్రేడ్ స్కాం అనే పేరుతో ఫేక్ పోస్టులు చేసి అభిమానులను మోసం చేయాలని చూసినట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా లక్ష్మీ షేర్ చేసిన స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


ఇటీవల లక్ష్మీ మంచు తన సోదరుడు మంచు మనోజ్తో తిరిగి కలసి భావోద్వేగానికి లోనైంది. ఆమె నిర్వహించిన వార్షిక ఫండ్రైజింగ్ కార్యక్రమంలో మనోజ్ అకస్మాత్తుగా వచ్చి లక్ష్మీని ఆశ్చర్యపరిచాడు. ఆ సంఘటనను స్మరించుకుంటూ, కుటుంబంలోని విభేదాల మధ్య ఇది తనకు గొప్ప భావోద్వేగాన్నిచ్చిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం వర్క్ ఫ్రంట్లో, లక్ష్మీ మంచు ‘యక్షిణి’ వెబ్ సిరీస్లో కనిపించింది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ తెలుగు భాషా ఫాంటసీ రొమాంటిక్ థ్రిల్లర్లో లక్ష్మీ కీలక పాత్ర పోషించింది. వేదిక ప్రధాన పాత్రలో నటించిన ఈ షోలో రాహుల్ విజయ్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సిరీస్ జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.

One thought on ““డబ్బు కావాలంటే నేరుగా అడుగుతాను” – లక్ష్మీ మంచు కౌంటర్!”
Comments are closed.