హర్యానాలోని గురుగ్రామ్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దాంతో పలు ప్రాంతాలు నీటమునిగి జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందన్న దానికీ నిదర్శనంగా ఓ న్యూస్ రిపోర్టర్ వరదలో ఈదుకుంటూ రిపోర్టింగ్ చేస్తూ వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనపై ట్వీట్ చేసిన కేటీఆర్, “ఈ రిపోర్టర్కి నిజంగా ఒలింపిక్స్ పంపాలి.. ఇంత అద్భుతమైన రిపోర్టింగ్ స్కిల్స్ ఎప్పుడూ చూడలేదు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి సూచిస్తూ గురుగ్రామ్లో బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు ప్రజల కష్టాలను తగ్గించకుండా పరిస్థితిని మెరుగుపరిచే విధంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Read More : హైదరాబాద్లో బోనాల సందర్భంగా వైన్స్ బంద్

One thought on “కేటీఆర్ వ్యంగ్యంగా ప్రధానికి సూచన”
Comments are closed.