ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ క్లీనింగ్ మెషీన్లు పంపిణీ.

ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాయిలెట్లను శుభ్రం చేయడానికి ఉద్దేశించిన యంత్రాలను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోతే అది విద్యార్థుల ఆరోగ్యానికి హానికరమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో నగరంలోని మరిన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ యంత్రాలను అందించే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Read More : 2036 ఒలింపిక్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ?

One thought on “ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ క్లీనింగ్ మెషీన్లు పంపిణీ.

Comments are closed.