ప్రముఖ గాయని కెనీషా తనను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో జరుగుతున్న బెదిరింపులపై కఠినంగా స్పందించారు. కొంతకాలంగా ఆమెకు గుర్తుతెలియని వ్యక్తులు అసభ్య సందేశాలు పంపుతూ, అత్యాచార బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ వేధింపులు హద్దు మించడంతో, ఆమె చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆమె టీమ్ అధికారికంగా ప్రకటించింది.
బెదిరింపులకు లీగల్ నోటీసులు
ఇన్స్టాగ్రామ్ ద్వారా వస్తున్న అసభ్య, అశ్లీల మెసేజ్ల వల్ల గాయని తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, ఈ మేరకు ఆధారంగా ఉన్న స్క్రీన్షాట్లను ఉపయోగించి లీగల్ నోటీసులు జారీ చేస్తామని ఆమె ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే కొన్ని నోటీసుల కాపీలను కెనీషా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం గమనార్హం.
గతంలో ఆవేదనతో షేర్ చేసిన పోస్ట్
ఇటీవలి కాలంలో తనను కొందరు తీవ్రంగా వేధిస్తున్నారంటూ కెనీషా ఒక సుదీర్ఘమైన పోస్ట్ ద్వారా తన భావాలు వ్యక్తం చేశారు. “ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నన్ను ద్వేషించకండి, ప్రశాంతంగా జీవించనివ్వండి” అంటూ తాను పొందుతున్న బెదిరింపులపై ఆవేదన వ్యక్తం చేశారు.
జయం రవితో సంబంధం పుకార్ల పుట్టించిందేనా?
కెనీషా, కోలీవుడ్ నటుడు జయం రవి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా ఫిల్మ్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలోనే ఆమెపై సోషల్ మీడియాలో బెదిరింపులు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వదంతులు నిజమేనో కాదో స్పష్టత లేకపోయినా, గాయని వ్యక్తిగత జీవితాన్ని లేనిపోని పుకార్లతో బాధపెట్టడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.
కెనీషా నిర్ణయానికి మద్దతు
ఆన్లైన్ వేధింపులను సహించకుండా, ధైర్యంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడంపై నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మహిళలపై ఇలాంటి బెదిరింపులకు చరమగీతం పలకాలంటే, కెనీషా లాంటి వారు ముందుకు రావాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read More : త్రిప్తి దిమ్రీ ‘స్పిరిట్’ సినిమాలో లీడింగ్ లేడీగా ?

One thought on “కెనీషా సోషల్ మీడియా బెదిరింపులపై చట్టపరమైన పోరాటానికి సిద్ధం.”
Comments are closed.