హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మొక్కలు నాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఒక డీసీఎం వాహనం వారిని ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
వివరాలు:
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్పై మొక్కలు నాటుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురు కూలీలను వెనుక నుండి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు కార్మికులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో కార్మికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Read More : హైదరాబాద్లో హైడ్రా సేవలు బంద్

One thought on “ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం”
Comments are closed.