తన సినిమాలతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే అప్పుడప్పుడు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకుంటున్న ధనుష్, తాజాగా ‘నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబం’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే టైటిల్తో డబ్ చేయగా, తమిళంలో విజయవంతమైన ఈ సినిమా తెలుగులోనూ మంచి స్పందన పొందింది.
థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.
సాధారణంగా అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ హక్కులు పొందిన సినిమాలు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంటాయి. కానీ జాబిలమ్మ నీకు అంత కోపమా తెలుగు వర్షన్ హక్కులను సింప్లీ సౌత్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ దక్కించుకుంది.
తెలుగు కంటెంట్ తక్కువగా ఉండే ఈ ఓటీటీకి సబ్స్క్రిప్షన్ తీసుకునే ప్రేక్షకులు తక్కువగా ఉండటంతో, ఈ సినిమా తెలుగు ఆడియన్స్కు అందుబాటులోకి రాలేదనే విమర్శలు వస్తున్నాయి.
ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా పరిచయమైన ఈ సినిమా యూత్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ధనుష్ తనదైన స్టైల్లో లవ్ స్టోరీని తెరకెక్కించి మరోసారి దర్శకుడిగా సక్సెస్ సాధించాడు. థియేటర్స్లో విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకర్షించగలదా అనేది చూడాలి. ఇకపై ధనుష్ సినిమాలను మెయిన్స్ట్రీమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఇవ్వాలనే డిమాండ్ కూడా ప్రేక్షకుల్లో పెరుగుతోంది.

One thought on “తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచిన ధనుష్ సినిమా జాబిలమ్మ ఓటీటీ రిలీజ్!”
Comments are closed.