2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు

క్రీడాభిమానులకు శుభవార్త. తొలిసారిగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు ఫలితాన్నిచ్చాయి. 2028లో లాస్ ఏంజెలెస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను అధికారికంగా చేర్చనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) మరియు లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ నిర్వాహక సంస్థలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయంతో క్రికెట్ అభిమానులకు ఇది ఒక చారిత్రాత్మక ముందడుగుగా నిలవనుంది.

ఈ పోటీలను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం ఆరు జట్లతో పురుషుల మరియు మహిళల విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. జట్ల ఎంపిక, అర్హత ప్రమాణాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు.

ఇంతకాలం వరకు కొన్ని గణనీయమైన దేశాల్లో మాత్రమే అధికారికంగా ఆడబడుతున్న క్రికెట్, ఇప్పుడు ఒలింపిక్స్ వేదికపై ప్రదర్శితమవడం ద్వారా గ్లోబల్ స్పోర్ట్స్‌గా మరింత విస్తరించే అవకాశముంది. ఈ నిర్ణయంతో క్రికెట్‌కు గల గౌరవం పెరగడమే కాకుండా, కొత్త దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి మార్గం సుగమం కానుంది.

6 జట్లు పోటీలో, అర్హత ప్రమాణాలపై స్పష్టత లేదు

టీ20 ఫార్మాట్‌లో మొత్తం ఆరు జట్లు ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.

అయితే, ఈ ఆరు జట్ల ఎంపిక ఎలా జరుగుతుంది? అర్హత ప్రమాణాలు ఏమిటన్నది ఇప్పటివరకు నిర్వాహకులు లేదా ICC అధికారికంగా ప్రకటించలేదు. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేసే అవకాశముందా? లేదా వేరే అర్హత టోర్నమెంట్ ద్వారా జట్లు ఎంపికవుతాయా అన్నది ఇంకా అనిశ్చితంగా ఉంది.

Read More : కజిరంగా నేషనల్ పార్క్‌లో సఫారీలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.