శర్వానంద్ ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రెగ్యులర్ ఫార్మాట్కు దూరంగా, యాక్షన్, ఫ్యామిలీ, లవ్ జోనర్ల మిక్స్తో బలమైన కంటెంట్ ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటూ, ఆడియన్స్లో అంచనాలు పెంచుతున్నారు. ఇప్పుడు ఆయన ‘చార్మింగ్ స్టార్ 38’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న పీరియడ్ డ్రామా సినిమాలో నటించనున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 1960ల తెలంగాణా-మహారాష్ట్ర బోర్డర్ ప్రాంతం నేపథ్యంగా సాగనుందని సమాచారం. డైరెక్టర్ సంపత్ నంది, మాస్ అంశాలతో పాటు భావోద్వేగాలను కలిపిన కంటెంట్తో ఈ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.
హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక చేయబడింది. ఆమె పాత్రకు సంబంధించి, మేకర్స్ ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఆమె లుక్ బ్లాక్ అండ్ వైట్ లో సగం మాత్రమే రివీల్ చేస్తూ, గ్రామీణ వాతావరణంలో సాగే కథనాన్ని సూచించారు.
ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన నేపథ్యంలో, షూటింగ్ త్వరలో ప్రారంభమవనుంది. ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు.

One thought on “అనుపమ-శర్వానంద్ మరోసారి స్క్రీన్పై: ‘చార్మింగ్ స్టార్ 38’!”
Comments are closed.