అమెరికాలోని టెక్సాస్లో జరిగిన విషాద రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా రాజేంద్రనగర్కు చెందిన వంగవోలు దీప్తి (23) మృతి చెందింది. కొన్నేళ్ల క్రితం దీప్తి ఎంఎస్ చదవడం కోసం టెక్సాస్లోని డెంటన్ నగరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో చేరారు.
ఈ నెల 12వ తేదీన, దీప్తి తన స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడుస్తుండగా, వేగంగా వచ్చిన ఓ కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీప్తి తలపై తీవ్ర గాయాలపాలైంది, కాగా స్నిగ్ధకు స్వల్ప గాయాలు కాగా, ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.
ఈ ప్రమాదం గురించి తల్లి తండ్రులకు సమాచారం అందించడంతో, గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన తన బృందంతో స్పందించి, మెరుగైన చికిత్స అందించడానికి చొరవ తీసుకున్నారు. స్నేహితులు, సంబంధితులు ఆన్లైన్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించి, 80వేల డాలర్లను సేకరించారు, కానీ దురదృష్టవశాత్తు, 15వ తేదీన దీప్తి మృతిచెందింది.
ఈ దారుణ ఘటన, దీప్తి కుటుంబం, స్నేహితులు, మరియు గుంటూరు జిల్లా వారిపై తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆమె తండ్రి హనుమంతరావు ఒక చిరు వ్యాపారి కాగా, ఆమె సోదరి శ్రీలక్ష్మి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు, అమెరికా వెళ్లేందుకు ఆమెకు చాలా కష్టపడినట్లు చెప్పారు, కానీ ఈ విషాద సంఘటన వారి జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది.
ఈ ఘటనకు సంబంధించి, శనివారానికి మృతదేహం గుంటూరుకు చేరుకోనుందని, అప్పటి వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని పెమ్మసాని రవిశంకర్ తెలిపారు.
Read More : విజయవాడ బస్టాండ్ దగ్గర ప్రైవేటు బస్సులో మంటలు…

One thought on “అమెరికాలో విషాదం : రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థిని వంగవోలు దీప్తి మృతి”
Comments are closed.