సికింద్రాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ ట్రైన్ నడిపేందుకు రైల్వే శాఖ కీలక ప్రణాళిక సిద్ధం చేసింది. వేగంగా, సౌకర్యంగా ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు ఇది శుభవార్తగా మారింది. సుమారు 1667 కిలోమీటర్ల దూరాన్ని ఒక్కరోజులోనే కవర్ చేసే ఈ ట్రైన్ సర్వీసు పట్ల దేశవ్యాప్తంగా ఆతృత నెలకొంది.
ఈ ట్రైన్ రాత్రి 8:50 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి, తదుపరి రోజు రాత్రి 8:00 గంటలకు సికింద్రాబాద్కు చేరుకోనుంది. అదే విధంగా రిటర్న్ జర్నీ కూడా సమానమైన సమయాల్లో ఉంటుంది. ప్రయాణదారుల సౌకర్యార్థం మూడు రకాల AC తరగతులను ఈ వందే భారత్ స్లీపర్లో అందుబాటులో ఉంచారు.
- థర్డ్ AC టిక్కెట్ ధర: ₹3600
- సెకండ్ AC టిక్కెట్ ధర: ₹4800
- ఫస్ట్ AC టిక్కెట్ ధర: ₹6000
ఈ రైలు ప్రయాణ సమయంలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగనుంది. వాటిలో ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగ్పూర్, బల్లార్ష, కాజీపేట స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో ఉన్న ప్రయాణికులకూ ఇది చక్కటి అవకాశం కానుంది.
స్లీపర్ వర్షన్లో వందే భారత్ను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన చివరి దశ పరీక్షలు జరుపుతున్నారు. అధికారిక తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇది అమలులోకి వచ్చాక, సౌకర్యవంతమైన రాత్రి ప్రయాణానికి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రధాన కేంద్రంగా మారనుంది.
Read More : ముంబై ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపుతో?

One thought on “సికింద్రాబాద్ – ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్”
Comments are closed.