గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం (ఏఐ171) సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ విమానం మేఘాని ప్రాంతంలో కూలిన వెంటనే దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేసాయి. విమానంలో దూర ప్రయాణానికి కావలసినంత ఇంధనం నిండి ఉండటంతో, కుప్పకూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
విజయ్ రూపానీ తన భార్యను లండన్లో నుంచి భారత్కు తీసుకురావడం కోసం ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్టు చెక్-ఇన్ రికార్డుల ద్వారా వెల్లడైంది. ఆయన బిజినెస్ క్లాస్లో (సీటు నంబర్ 2డి) మధ్యాహ్నం 12:10 గంటలకు జోన్ 1 నుంచి బోర్డింగ్ పూర్తి చేసినట్టు సమాచారం. ఆయన టికెట్ బుకింగ్ రిఫరెన్స్ 6ఎఫ్కే2ఎం2 కాగా, ఇ-టికెట్ నంబర్ 0982865207073గా నమోదైంది. ఈ ఘోర ప్రమాద తీవ్రతను పరిశీలిస్తే, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉందని విమానయాన నిపుణులు భావిస్తున్నారు.
ఈ విషాదకర ఘటనపై అధికారులు మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారని సమాచారం.
Read More : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం

One thought on “విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ మృతి”
Comments are closed.