ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్లు వేసిన వలపు వలలో చిక్కుకున్న 80 ఏళ్ల వృద్ధుడు ఏకంగా రూ. 8.7 కోట్లు పోగొట్టుకున్నాడు. 2023లో మొదలైన ఈ మోసంలో వృద్ధుడు సుమారు 734 సార్లు డబ్బు పంపించినట్లు పోలీసులు తెలిపారు.
మోసం ఎలా జరిగింది?
- షార్వీ అనే పేరుతో పరిచయం: మొదట, ఫేస్బుక్లో ‘షార్వీ’ అనే పేరుతో ఓ మహిళ వృద్ధుడికి పరిచయమైంది. ఆమె తన భర్త నుంచి విడిపోయి పిల్లలతో ఒంటరిగా ఉంటున్నానని నమ్మించి, అతడితో తరచుగా ఫోన్లో మాట్లాడింది. వివిధ అవసరాల పేరుతో ఆమె వృద్ధుడి నుంచి డబ్బు రాబట్టసాగింది.
- కొత్త ట్రాప్లు: ఆ తర్వాత ‘కవిత’ అనే మరో మహిళ ఆమె స్నేహితురాలిగా పరిచయమైంది. ఆ తర్వాత షార్వీ చనిపోయిందని చెప్పి, ఆమె సోదరి ‘దినాజ్’గా పరిచయమైన మరో మహిళ ఆసుపత్రి బిల్లుల పేరుతో డబ్బులు వసూలు చేసింది. ఇలా మొత్తం నలుగురు మహిళల పేర్లతో సైబర్ నేరగాళ్లు ఆ వృద్ధుడిని మోసం చేశారు.
- డబ్బులు పోగొట్టుకున్న వృద్ధుడు: తన వద్ద డబ్బులు అయిపోయిన తర్వాత కూడా వృద్ధుడు అప్పు చేసి మరీ మోసగాళ్లకు పంపించాడు. చివరకు కుటుంబ సభ్యులు డబ్బుల గురించి ఆరా తీయగా ఈ విషయం బయటపడింది.
- ఆసుపత్రి పాలైన బాధితుడు: జరిగిన మోసం తెలుసుకున్న వృద్ధుడు ఆసుపత్రి పాలయ్యారు. వైద్యులు ఆయనకు డిమెన్షియా ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సైబర్ మోసం గురించి తెలిసినవారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read More : రాహుల్ గాంధీపై అమిత్ షా విమర్శలు
