కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా బీహార్లో పార్టీ ఓటమిని ముందుగానే రాహుల్ గాంధీ సమర్థించుకుంటున్నారని అమిత్ షా ఆరోపించారు.
ప్రత్యేక పునర్విమర్శ గురించి అమిత్ షా ఏమన్నారంటే..
ప్రత్యేక పునర్విమర్శ అనేది నెహ్రూ ప్రారంభించిన ఒక పాత విధానమని, ఇది చివరిసారిగా 2003లో జరిగిందని అమిత్ షా తెలిపారు. దీనిని రాహుల్ గాంధీ ఇప్పుడు కొత్త వివాదంగా సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేశంలో మతపరమైన విభజన తీసుకువస్తోందని అమిత్ షా ఆరోపించారు.
Read More : జాతీయ విద్యా విధానానికి తమిళనాడు ప్రభుత్వం స్వస్తి

One thought on “రాహుల్ గాంధీపై అమిత్ షా విమర్శలు”
Comments are closed.