వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరియు పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పల్నాడు జిల్లా సరిహద్దు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
వైసీపీ నేతల వాహనాలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై అంబటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు తన వాహనం నిలిపివేయడాన్ని వ్యతిరేకించిన అంబటి, బ్యారికేడ్లు తొలగించాలని అధికారులను కోరారు. అయితే పోలీసులు తిరస్కరించడంతో ఆయన స్వయంగా బ్యారికేడ్లను పక్కకు నెట్టేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరైన నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఘటనపై వైసీపీ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read More : ఫోన్ ట్యాపింగ్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

One thought on “బ్యారికేడ్లు తొలగించిన అంబటి రాంబాబు”
Comments are closed.